pizza
Raja Cheyyi Vesthe music launch on 25 March
మార్చి 25న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, నటసింహ నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ‘రాజా చెయ్యి వేస్తే’ ఆడియో విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

20 March 2016
Hyderaba
d

బాణం' సినిమా నుండి డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న హీరో నారా రోహిత్ కథనాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘రాజా చెయ్యి వేస్తే’. ఈగ’, ‘అందాల రాక్షసి’, ’లెజండ్’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంతో పాటు తొలి చిత్రం ‘ఈగ’ తో నేషనల్ స్థాయి అవార్డు చేజిక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ వారాహిచలనచిత్రం బ్యానర్ పై సాయిశివాని సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నందరమూరి తారకరత్న విలన్ గా నటిస్తుండటం విశేషం. ఇలా నారా, నందమూరి హీరోలు కథనాయకుడు, ప్రతినాయకుడు పాత్రల్లో నటిస్తుండటంతో సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తిని రేకెత్తించింది. అల్రెడి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది.

మురారి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా ప్రస్తుతం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తనదైన శైలితో రాణిస్తున్న సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని మార్చి 25న విజయవాడలోని సిద్ధార్థ్ పబ్లిక్ స్కూల్(వీరమాచినేని పెద్దయ్య) లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నటసింహ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథులు హాజరవుతారు. వారి చేతుల మీదుగా ఆడియో విడుదలవుతుంది. వీరితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. సినిమాకు సంబందించిన అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved