pizza
సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘రణం 2’
You are at idlebrain.com > news today >
Follow Us

14 April 2015
Hyderabad

విఐపి(విక్టరీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌) సమర్పణలో శ్రీవెంకటేశ్వర మూవీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మాత గోపనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘రణం 2’. ఈ చిత్రానికి హీరో మరియు దర్శకుడు అమ్మ రాజశేఖర్‌. ఆర్తీ అగర్వాల్‌, నిధిలు హీరోయిన్‌లుగా నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గోపనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ..‘మా దర్శకుడు మరియు హీరో అయినటువంటి అమ్మ రాజశేఖర్‌గారు..హీరో గోపీచంద్‌తో చేసిన ‘రణం’ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి ఏ మాత్రం తగ్గకుండా..అమ్మ రాజశేఖర్‌ ఈ ‘రణం 2’ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్‌ నుండి ‘యు/ఎ’ సర్టిఫికెట్‌ పొందిన ఈ చిత్రాన్ని ఈ నెలాఖరుకి విడుదల చేయనున్నాం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్‌ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించి మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాము..’ అని అన్నారు.

అమ్మ రాజశేఖర్‌, నిధి, పృథ్వి, నల్లవేణు, శ్రవణ్‌, ఫిష్‌ వెంకట్‌, సుబ్బరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి
సంగీతం: మణిశర్మ;
కెమెరామెన్‌: శ్రీధర్‌;
నిర్మాత: గోపనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అమ్మ రాజశేఖర్‌

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved