15 October 2015
Hyderabad
ఈ నెల 30న రెడ్ అలర్ట్
ఏకకాలంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ... ఇలా నాలుగు భాషల్లో రూపొందిన ఘనతను దక్కించుకున్న చిత్రం 'రెడ్ అలర్ట్'. ఇప్పటికే కన్నడం, మలయాళ భాషల్లో విడుదలై, ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నెల 30న తెలుగు చిత్రాన్ని విడుదల చేయనున్నామని చిత్ర దర్శకుడు చంద్రమహేశ్ తెలిపారు. సినీ నిలయ క్రియేషన్స్ పతాకంపై పి.యస్. త్రిలోక్ రెడ్డి సమర్పణలో హెచ్.హెచ్.మహాదేవ్, అంజనా మీనన్ జంటగా పీవీ శ్రీరామ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రవిశేషాల గురించి చంద్రమహేశ్ చెబుతూ - " ఈ చిత్రకథ విషయానికొస్తే.. హైదరాబాద్ లో భారీగా జరిగే వినాయకుడి నిమజ్జనాన్ని చూడటానికి ఓ పల్లెటూరికి చెందిన నలుగురు కుర్రాళ్లు నగరానికి వస్తారు. ఆ నలుగురి జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? అనే కథాంశంతో చిత్రం సాగుతుంది. సంస్కృతంలో గణేశుడిపై ఓ ప్రత్యేక పాటను కూడా మా సినిమాలో పెట్టాం. మా సినిమాలోని పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ నెల 30న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.
సుమన్, కె.భాగ్యరాజా, అలీ, పోసాని కృష్ణమురళీ, వినోద్ కుమార్, అనితా చౌదరి, మధుమిత తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, మాటలు - శ్రీరామ్ చౌదరి, సంగీతం - రవివర్మ, కెమెరా - కళ్యాణ్ సమి, ఎడిటింగ్ - గౌతంరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత - జైపాల్ రెడ్డి, కో-ప్రొడ్యూసర్ - శ్రీమతి పిన్నింటి శ్రీరాంసత్యరెడ్డి, నిర్మాత - పి.వి.శ్రీరాంరెడ్డి, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - చంద్రమహేశ్.