28 January 2016
Hyderabad
సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం చిత్రీకరణ పూర్తి చెసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చెయనున్నారు.. ఈసందర్బంగా ..
సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ..నా కెరీర్ లో ఓ స్పెషల్ మూవీ గా నిలిచే చిత్రమిది. మారిన తెలుగు సినిమా ట్రెండ్ కు తగ్గట్టు గా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో టాలెంటెడ్ టీమ్ కలయికలో ఈ సినిమా తెరకెక్కించబడిందన్నారు..
శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నో భారీ సినిమాల ఆఫర్స్ నా వద్దకు వచ్చినా ,వాటన్నింటిని కాదని, దర్శకుడు సుదర్శన్ చెప్పిన కధకధనాలు నచ్చి ఈ సినిమా చెస్తున్నాను.నాతో పాటు టీమ్ అందరికి ఈ సినిమా మంచి పేరును తీసుకు వస్తుందన్నారు..
దర్శకుడు మాట్లాడుతూ.. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఎన్నో కాంటెపరరీ ఇష్యూస్ ను టచ్ చేస్తూ చెసిన చిత్రమిది. ఫీల్గుడ్ లవ్ స్టోరీ ఈ సినిమాకు ప్రదానాకర్షణగా నిలుస్తుందన్నారు.
నిర్మాత మాట్లాడుతూ...ఫిబ్రవరిలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించనున్నాము.అన్ని వర్గాల వారిని అలరించెలా మా చిత్రం తెరకెక్కింబడింది. సినిమా ఔట్పుట్ చూసిన అనంతరం మా టీమ్ ఈ చిత్ర విజయంపై మరింత కాన్ఫిడెన్స్ తో ఉన్నామన్నారు..
రేష్మిమీనన్ కధానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ఎం.ఎస్ నారాయణ , ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాద్, పృద్వీ, వైవాహర్ష, జబర్దస్త్ టీమ్ తదితరులు నటిస్తున్నారు
కెమెరా: సిద్దార్ద్.. కూర్పు : కార్తీక్, సంగీతం: మహిత్ నారాయణ్.