26 June 2015
Hyderabad
60 శాతం పూర్తయిన ‘సతీ తిమ్మమాంబ’
ఎస్.ఎస్.ఎస్. ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భవ్యశ్రీ ప్రదాన పాత్రలో రూపొందుతున్న హిస్టారికల్ మూవీ ‘సతీ తిమ్మమాంబ’. ఈ చిత్రం 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుని తదుపరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పెద్దరాసు సుబ్రమణ్యం మాట్లాడుతూ..‘అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో ఏడెకరాల భూమిలో వెలిసిన తిమ్మమ్మ మర్రిమాను చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. 600 వందల సంవత్సరాల చరిత్ర గలిగిన ఈ చెట్టు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. ఈ చరిత్రను ప్రజలకు చేరవేయాలనే ఉద్ధేశ్యంతో ఆ తిమ్మమ్మ వారసుసులమైన మేము ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఈ చెట్టు ఎంతో మహిమ గలది. అన్ని కాలాలలోనూ పచ్చగానే ఉంటుంది. ఈ చెట్టు దగ్గర ఎవరైనా ఏదైనా కోరిక కోరుకుంటే తప్పక ఆ కోరిక తీరుతుందనే నమ్మకం ఇప్పటికీ ప్రజలలో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం 60 శాతం చిత్రీకరణ జరుపుకుంది. తదుపరి గోల్కోండ ఖిల్లా, తలకోన, అనంతపురంలలో చిత్రీకరణ జరుపనున్నాం...’’ అన్నారు.
భవ్యశ్రీ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రంలో ప్రభాకర్, రంగనాధ్, చంద్రమోహన్, రాజశ్రీ, జూనియర్ రేలంగి మొదలగు వారు ఇతర తారాగణం.
ఈ చిత్రానికి సంగీతం: బండారు దానయ్య కవి,
నిర్మాత: పెద్దరాసు సుబ్రమణ్యం,
దర్శకత్వ పర్యవేక్షణ: ఎస్. రామ్కుమార్,
కథ-మాటలు-స్క్రీన్ప్లే-దర్శకత్వం: బాలగొండ ఆంజనేయులు.