శేఖర్ వర్మ, దీప్తిశెట్టి హీరో హీరోయిన్లుగా గాయత్రి ప్రొడక్షన్స్ బ్యానర్ఫై నరేష్.పి దర్శకత్వంలో కె.ఎన్.రావు నిర్మాతగా రూపొందిన చిత్రం `శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట`. ఈ సినిమా మే 26న విడుదలైంది. ఈ సందర్భంగా హీరో శేఖర్ వర్మ పాత్రికేయులతో మాట్లాడారు.
శేఖర్ వర్మ మాట్లాడుతూ - ``కొత్త సినిమా అయినా మంచి టాక్ రావడం వల్ల సినిమాకు కెలక్షన్స్ పెరుగుతున్నాయి. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకమే మా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా చేసింది. నా పేరు రాజశేఖర్ వర్మ. నాది కాకినాడ పక్కన గొల్లపాళెం అనే పెల్లెటూరు. హైదరాబాద్లో చిన్న చిన్న బిజినెస్లున్నాయి. హీరో కావాలనే కోరికతోనే ఇండస్ట్రీలోకి ఎంటర్అయ్యాను. శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట సినిమాతో నా కోరిక నేరవేరింది. నాన్న రైతు. అన్నయ్య డిస్ట్రిబ్యూటర్. దర్శకుడు నరేష్ పెంటకు నాకు ఏడేనిమిదేళ్ళుగా మంచి పరిచయం ఉంది. నరేష్ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేశాను. ఓ మంచి సినిమాతో హీరోగా పరిచయం అయినందుకు ఆనందంగా ఉంది. గోదావరి జిల్లాలు, వైజాగ్ ప్రాంతాల్లో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మధుసూదన్గారు, గీతాంజలి, గౌతంరాజు వంటి సీనియర్ ఆర్టిస్టుల నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా మధుసూదన్గారు విలన్గా నటించారు. ఈ సినిమాలో ఆయన పాత్రను చక్కగా ఉంది. ఆయన పాత్రను లీడ్ చేసిన విధానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసినవారు కొత్త హీరోలా కాకుండా సెటిల్డ్గా చేశావని మెచ్చుకున్నారు. మంచి కథాబలం ఉన్న సినిమాలో చేయడం ఆనందంగా ఉంది`` అన్నారు.