pizza
Shivam 70 percent talkie completed
You are at idlebrain.com > news today >
Follow Us

22 June 2015
Hyderabad

ఊటీకి వెళ్లొచ్చిన రామ్

ఇటీవలే 'పండగ చేస్కో' అంటూ ప్రేక్షకులు పండగ చేసుకునే సినిమా ఇచ్చిన రామ్ ప్రస్తుతం మరో రెండు విజయవంతమైన చిత్రాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఒకటి 'శివం'. మరోటి 'హరికథ' (వర్కింగ్ టైటిల్). ఈ రెండు చిత్రాల్లో ప్రస్తుతం రామ్ 'శివం' చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. శ్రీనివాసరెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా కథానాయిక.

ఈ చిత్రవిశేషాలను 'స్రవంతి' రవికిశోర్ తెలియజేస్తూ - ''ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ. ఈ చిత్రంలో రామ్ పాత్ర చిత్రణ చాలా అద్భుతంగా ఉంటుంది. క్లాస్, మాస్ ని ఆకట్టుకునే అంశాలతో రూపొందుతున్న చిత్రం ఇది. మే 26 నుంచి ఈ నెల 12 వరకూ హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ జరిపాం. ఈ నెల 12న ఊటీలో ఓ షెడ్యూల్ ప్రారంభించి, వారం రోజుల పాటు చిత్రీకరణ జరిపాం. దీంతో 70 శాతం టాకీ, క్లయిమ్యాక్స్ పూర్తయ్యాయి. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

ఇది హై ఓల్టేజ్ లవ్ స్టోరీ అని, సినిమా బాగా వస్తోందని రామ్ అన్నారు.

బ్రహ్మానందం, అభిమన్యు సింగ్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రసూల్, ఫైట్స్: పీటర్ హేన్స్, సమర్పణ: కృష్ణచైతన్య.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved