21 March 2016
Hyderabad
పద్మాలయ స్టూడియో బ్యానర్ పై సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయం చేసి తోలి సారిగా దర్శకత్వం వహించిన తోలి తెలుగు 70MM జానపద చిత్రం "సింహాసనం" 1986 మార్చ్ 21 న విడుదల కాగా, 2016 మార్చ్ 21 కి 30 ఏళ్ళు పూర్తి చేస్కోవడం విశేషం.
తెలుగు, హిందీ భాషల్లో రూపొంది , ప్రముఖ సంగీత దర్శకులు బప్పి లహరి సంగీతం తో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఘన విజయం సాధించటం చెప్పుకోదగ్గ విషయం .
ఈ చిత్రం విడుదల అయ్యి 30 సంవత్సరాలు పూర్తి చేస్కున్న సందర్భంగా మార్చ్ 21, 2016, సోమవారం నట శేఖర కృష్ణ, అల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజా సేన అధ్యక్షులు మహమ్మద్ ఖాదర్ ఘోరి ఆధ్వర్యం లో కేకు కట్ చేసి శుభాకాంక్షలు అందజేసారు .
ఈ సందర్భంగా ఖాదర్ ఘోరి మాట్లాడుతూ , అభిమానులు గర్వించ దగ్గ చిత్రం సింహాసనం అని తెలుగు హిందీ భాషల్లో కృష్ణ గారు తోలి సారి దర్సకత్వం వహించి , సంగీత పరంగా సూపర్ హిట్ అవ్వడం సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు .
ఈ కార్యక్రమం లో మహమ్మద్ పర్వ చిష్టి , కావలి కోట రమేష్ , మధు , రమణ , తదితర అభిమానులు పాల్గొన్నారు.