స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 's/o సత్యమూర్తి' ఏప్రిల్ 9న అత్యధిక ధియోటర్స్ లొ విడుదలయ్యింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o సత్యమూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటించారు. ఈచిత్రం ఓపెనింగ్ డే నే సూపర్హిట్ టాక్ ని సాదించటమే కాకుండా రికార్డు కలెక్షన్ల రాబట్టింది. ఆల్ ఎరియాస్ లో మౌత్ టాక్ తొ ధియెటర్స్ కి ప్రేక్షకుల్ని రాబట్టుతుంది. టాలివుడ్ టాప్ 3 ఓపెనింగ్ గ్రాసర్ గా 's/o సత్యమూర్తిస నిలిచింది. అంతేకాకుండా కన్నడలో టాప్ 1 గ్రాసర్ గా నిలవటం విశేషం. ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్ల రికార్డుల సాధిస్తుందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నారు. .
ఈ సందర్భంగా నిర్మాత ఎస్.రాధాకృష్ణ తన ఆనందాన్ని పంచుతూ " స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ తో మా బ్యానర్లో చిత్రీకరించిన 's/o సత్యమూర్తి' ఏప్రిల్ 9న గ్రాండ్ గా విడుదలయ్యింది.విడుదల రోజు ఉదయం ఆటనుండే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి సూపర్ హిట్ అనే టాక్ వినటం చాలా ఆనందంగా వుంది. అంతే కాకుండా ఎంతో పవర్ఫుల్ అయిన మౌత్ టాక్ పెరగటం దియోటర్స్ కి తండోపతండాలుగా రావటం సంతోషంగా వుంది. మెదటిరోజునే అల్లు అర్జున్ కెరీర్ లో రికార్డు ఓపెనింగ్ వచ్చింది. బన్ని కెరీర్ లో ఇది నెం1 చిత్రంగా నిలుస్తుందని అంతే కాకుండా 2015 లో ఇప్పటి వరకూ ఇదే హయ్యస్ట్ గ్రాసర్ గా వుండబోతుందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నారు. అంతేకాకుండా కన్నడ ఇండస్ట్రిలొ నటుడు ఉపేంద్ర మా చిత్రంలొ నటించడంతొ కన్నడలో కూడా బారీ ఓపేనింగ్స్ వచ్చి నెంబర్ 1 గా నిలిచింది. మా డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎగ్జిబ్యుటర్స్ సినిమా గురించి తమ సంతోషాల్ని వ్యక్తం చేస్తున్నారు. చూసిన ప్రతి ప్రేక్షకుడు ఇంత మంచి విలువలున్న చిత్రం ఈ మద్య కాలంలో రాలేదంటున్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ గారి మాటలు అందరి మనసుల్ని ఆకట్టుకునేలా వున్నాయి. అవి అల్లు అర్జున్ నొట రాగా అందరి మనసుల్లోకి దూసుకుపోయాయి. ప్రకాష్రాజ్ చెప్పిన పులి మేక కథ నుంచి స్టార్టయితే అసలు తండ్రి గురించి హీరోయిన్ సమంత దగ్గరి బన్ని చెప్పే డైలాగ్ కానివ్వండి, రాజేంద్రప్రసాద్ దగ్గర అల్లు అర్జన్ కొన్ని సార్లు ఓడిపోవడమే మంచిదని పురాణాల ఆధారంగా చెప్పిన డైలాగ్ కాని చివరిలో ఉపేంద్ర చెప్పే డైలాగ్స్ కాని ఇలా ఓకటేంటి త్రివిక్రమ్ గారు రాసిన ప్రతి డైలాగ్ , అల్లు అర్జున్ చెప్పిన ప్రతి మాట, బ్రహ్మనందం వేసిన పంచ్ లు, రాజేంద్రప్రసాద్ పాత్ర తెప్పించే నవ్వులు, అలీ చేసిన కామెడి, ఎమ్.ఎస్.నారాయణ, రావురమేష్ ల మద్య సన్నివేశాలు ఇలా ప్రతి ఒక్క సన్నివేశం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి కాబట్టే ఇంతటి ఘనవిజయాన్ని అందించారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకి మా చిత్రం యూనిట్ తరుపున ధన్యవాదాలు .అని అన్నారు.
సాంకేతిక వర్గం
పి.ఆర్.వో- ఎస్.కె.ఎన్, ఏలూరుశ్రీను
ఆర్ట్ - రవీందర్
కెమెరా - ప్రసాద్ మూరెళ్ల
మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్
నిర్మాత - రాధాకృష్ణ
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్