5 December 2017
Hyderabad
`పెళ్ళిచూపులు` తర్వాత డి.సురేష్ బాబు సమర్పణలో దర్మపథ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘మెంటల్ మదిలో’. రాజ్ కందుకూరి నిర్మాత. వివేక్ ఆత్రేయ దర్శకుడు. శ్రీవిష్ణు, నివేథా పేతురాజ్ జంటగా నటించారు. ఈ సినిమా నవంబర్ 24న విడుదలైంది.
ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు సినిమా సక్సెస్ గురించి పాత్రికేయులతో మాట్లాడుతూ ..``సినిమా సక్సెస్ పట్ల ఓ నటుడిగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఓ చిన్న సినిమా బావుందని అప్రిసియేషన్ ఒకవైపు వస్తుంటే, కలెక్షన్స్ పరంగా కూడా సినిమా విజయవంతం కావడం రెట్టింపు ఆనందానిస్తుంది. నేను చేసిన సినిమాల్లో ఈ సినిమాకు ఎక్కువగా డబ్బులు వచ్చాయి. `అప్పట్లో ఒకడుండేవాడు` విడుదలకు వారం ముందుగా రాజ్ కందుకూరిగారు నాకు ఫోన్ చేసి వివేక్ను పంపారు. సాధారణంగా కథ విన్న తర్వాత నేను ఓ వారం గ్యాప్ తీసుకుని, నాకు సెట్ అవుతుందా? నేను చేయగలుగుతానా? అని ముందుగా ఆలోచిస్తాను. అంతా ఓకే అనుకున్న తర్వాత సినిమా చేయడానికి ఎస్ అంటాను. కానీ ఈ సినిమా విన్న పది నిమిషాలకే సినిమా చేస్తానని చెప్పాను. అంతే కాకుండా సినిమా కొత్తగా ఉందని వివేక్తో చెప్పాను. కథ వినే సమయంలో రైటింగ్ నాకు బాగా నచ్చింది. ప్రతి సినిమాలో కాస్త డిఫరెంట్గా కనపడాలనే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు సినిమాలను అలాగే సెలక్ట్ చేసుకుంటూ వస్తున్నాను.
ప్రతి విషయంలో చిన్నపాటి కన్ఫ్యూజన్ అనేది కామన్గా ఉంటుంది. అలాంటి పాయింట్పైనే సినిమా అంతా రన్ అవుతుందని తెలియగానే సినిమా కచ్చితంగా ప్రేక్షకుడికి నచ్చుతుందనిపించింది. ఓ కథ వినేటప్పుడు నాకు ఏదీ సెట్ అవుతుందో నాకు తెలుసు. ఎంత మంచి కథ అయినా, నాకు సెట్ అవదనిపిస్తే, కచ్చితంగా చేయను. నారారోహిత్గారితో గెస్ట్ రోల్ చేయించాలనేది రాజ్కందుకూరిగారి ఆలోచన. ఆయన నాకు విషయాన్ని చెప్పగానే బావుంటుదనిపించింది. రోహిత్ను మీరు అడగండి..నేను కూడా అడుగుతాను. తప్పకుండా చేస్తాడని చెప్పాను. తనను అడగ్గానే తను కూడా ఒప్పుకున్నాడు.
సినిమా ప్రీమియర్స్ నుండి అందరికీ నచ్చింది. ముఖ్యంగా అందులో శివాజీరాజా, హీరోయిన్ నివేదాతో జరిగే సంభాషణలు ప్రేక్షకులు అందరికీ నచ్చాయి. రాజ్ కందుకూరిగారు టీంకు చక్కగా సపోర్ట్ చేశారు. ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. `నీది నాది ఒకే కథ` అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. `వీరభోగ వసంతరాయులు` షూటింగ్లో పాల్గొనాలి. `తిప్పరా మీసం` అనే కొత్త సినిమాను స్టార్ట్ చేయబోతున్నాను`` అన్నారు.