pizza
Srikanth arranges lunch for 500 people
500 మందికి భోజనం పెట్టిన హీరో శ్రీకాంత్
You are at idlebrain.com > news today >
Follow Us

15 April 2020
Hyderabad



హీరో శ్రీకాంత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసఫ్ గూడ లోని కృష్ణకాంత్ పార్కు దగ్గర ఐదు వందల మందికి బుధవారం మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు భారీగా పోలీస్ బందోబస్త్ మధ్య ఈ కార్యక్రమం అక్కడ జరిగింది.

ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ తో పాటుగా శ్రీ మిత్ర చౌదరి, డీసీపీ ట్రాఫిక్, చౌహన్ మరియు పలుగురు పోలీస్ సిబ్బందులతో కలసి యూసుఫ్ గూడ కృష్ణ కాంత్ పార్క్ ముందు ఫుడ్ ప్యాకెట్స్ ను అందచేశారు .

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ కారోన మహమ్మారి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసులు పర్మిషన్ తో వారి ఆధ్వర్యంలోనే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసుల సహకారం మరువలేనిది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. ఆకలితో అలమటిస్తున్న కొంతమందికైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. లాక్ డౌన్ ఉన్నంతకాలం నాకు చేతనైనంత వరకు నేను ఇలా సాయం చేయాలనుకుంటున్నాను. అందరూ ఇంట్లో ఉండి కారోన మహమ్మారి ని తరిమికొట్టాలి అని పిలునిచ్చారు హీరో శ్రీకాంత్.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved