11 November 2017
Hyderabad
ఫైట్ మాస్టర్ నాగరాజు `నేనే రాజు నేనే మంత్రి` షూటింగ్ సమయంలో అనారోగ్యం కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ చిత్ర యూనిట్ తో పాటు, సినీ పరిశ్రమకు చెందిన మరికొంత మంది సహకారంతో ఆర్ధిక సహాయం ప్రకటించింది.
దీనిలో భాగంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియో లో `మా` అధ్యక్షులు శివాజీ రాజా ఆధ్వర్యంలో నిర్మాత సురేష్ బాబు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్ ను అందించడం జరిగింది. నాగరాజు భార్య సంధ్య చెక్ ను అందుకున్నారు. అనంతరం నాగరాజు-సంధ్య దంపతుల ముగ్గురు ఆడపిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సురేష్ బాబు ఆకాంక్షించారు. అలాగే ఈ సహాయం పట్ల `మా` అధ్యక్షులు శివాజీ రాజా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ యూనియన్ ప్రెసిడెంట్ సతీష్ తదితరులు పాల్గున్నారు.