pizza
Terror censor completed
You are at idlebrain.com > news today >
Follow Us

14 August 2015
Hyderabad

సెన్సార్‌ పూర్తి చేసుకున్న 'టెర్రర్‌'

అఖండ భారత్‌ క్రియేషన్స్‌ పతాకంపై షేక్‌ కరీమా సమర్పణలో శ్రీకాంత్‌, నిఖిత హీరో హీరోయిన్‌లుగా సతీష్‌ కాసెట్టి దర్శకత్వంలో నిర్మాత షేక్‌ మస్తాన్‌ రూపొందించిన చిత్రం 'టెర్రర్‌'. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత షేక్‌ మస్తాన్‌ చిత్ర విశేషాలను తెలియజేస్తూ..'శ్రీకాంత్‌ ఓ సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆద్యంతం అందరికీ ఉత్కంఠతను కలిగిస్తుంది. 'ఖడ్గం' తర్వాత మా హీరో శ్రీకాంత్‌ పవర్‌ ఫుల్‌ అండ్‌ ఇంటిలిజెంట్‌ పోలీస్‌ పాత్రను ఈ చిత్రంలో చేశారు. శ్రీకాంత్‌గారి కెరియర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రమే కాకుండా మా సంస్థకు మంచి పేరు తెచ్చే చిత్రంగా ఈ చిత్రం రూపొందింది. ప్రతి సీన్‌ని దర్శకుడు సతీష్‌ కాసెట్టి అత్యద్భుతంగా తెరకెక్కించాడు. ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసే అన్ని ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్‌ నుండి యు/ఎ సర్టిఫికెట్‌ని పొందిన మా 'టెర్రర్‌' చిత్రాన్ని ఈ నెలాఖరుకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము..' అని అన్నారు.

శ్రీకాంత్‌, నిఖిత, కోట శ్రీనివాసరావు, నాజర్‌, పృథ్వీ, వినయర్‌ వర్మ, ఉత్తేజ్‌, రవివర్మ, విజయ్‌చందర్‌, సుధ, ముజ్‌తబ జిఫర్‌, సంజయ్‌ రాయ్‌చూర్‌ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: షేక్‌ కరీమా, మాటలు: లక్ష్మీభూపాల్‌, ఎడిటర్‌: బసవ పైడిరెడ్డి, ఆర్ట్‌: మురళి కొండేటి, ఫైట్స్‌: రన్‌ జాఘవా, సినిమాటోగ్రఫీ: వాసిలి శ్యామ్‌ప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌: షేక్‌ జైనులాబ్దీన్‌

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: హరి అయినీడి,
నిర్మాత: షేక్‌ మస్తాన్‌,
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సతీష్‌ కాసెట్టి

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved