|
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
2 October 2018
USA
సెప్టెంబర్30: అమెరికాలో తెలుగు వారిని ఏకం చేస్తూ నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో చికాగోలో నిర్వహించిన నాట్స్ సూపర్ 8 క్రికెట్ టోర్నమెంటుకు విశేష స్పందన లభించింది. దాదాపు 150 మంది క్రికెట్ ప్లేయర్లు ఈ టోర్నమెంటులో పాల్గొన్నారు. పక్కా ప్రణాళిక, సమన్వయంతో నాట్స్ యెన్స్ శ్రీనివాస్ పిళ్ల, రామకృష్ణ బాలినేనిలు ఈ టోర్నమెంటు విజయంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ నాయకులు మదన్ పాములపాటి, రాజేష్ వీధులమూడి, మహేశ్ కాకర్ల, మూర్తి కొప్పాక, శ్రీనివాస్ పిడికిటి, శ్రీహరి ముమ్మనగండి.. ఈ టోర్నమెంటు కోసం తమవంతు కృషి చేశారు. కృష్ణ నిమ్మగడ్డ, కృష్ణ నున్న, శ్రీనివాస్ బొప్పన్న, వెంకట్ దామలూరి, వెంకట్ తోట, వేణు కృష్ణ్రుదల, కిరణ్ అంబటి, శ్రీకాంత్ బొజ్జ, అరవింద్ కోగంటి, అరుల్ బాబు, పవన్ పవార్, సుతాన్ పెరియస్వామి, గోపాల్ రెడ్డి, రామ్ కేశకర్తి, సందీప్ తదితర నాట్స్ వాలంటీర్లు ఈ టోర్నమెంటు కోసం తమ విలువైన సేవలు అందించారు. నాట్స్ చికాగో చాప్టర్ ఈ టోర్నమెంటుకు కావాల్సిన ఏర్పాట్లు చేసింది.
|
|
|
|
|
|