pizza
Malupu release on 19 February
Evaru teaser launch
'ఎవరు' టీజర్ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 February 2016
Hyderabad

ముప్పా క్రాంతి చిత్ర బ్యానర్ పై తారకరత్న, పంచి బోరా, అనూప్ తేజ్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘ఎవరు’. రమణ సాల్వ దర్శకత్వంలో ముప్పా అంకమ్మ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో...

సింధూరపువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘'హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలు కలగలిసిన ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా పెద్ద సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

దర్శకుడు వెంకటరమణ సాల్వ మాట్లాడుతూ ‘’తారకరత్న ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో కనపడుతున్నారు. రెండు, మూడు పాత్రలతో సినిమా ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు.

తారకరత్న మాట్లాడుతూ ‘’డిఫరెంట్ స్క్రిప్ట్. సినిమాలో హీరో, హీరోయిన్ అని కాకుండా ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ కనపడుతుంది. అందరూ కష్టపడి సినిమా చేశఆం. అందరికీ మైల్డ్ స్టోన్ సినిమాగా నిలిచిపోతుంది’’ అన్నారు.

నిర్మాత ముప్పా అంకమ్మ చౌదరి మాట్లాడుతూ ‘'మా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మా సంస్థ నుండి మంచి సినిమాలు రావాలనే ఉద్దేశ్యంతో చేసిన సినిమా. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన పాటలోనే సినిమా కథ ఇమిడి ఉంటుంది. ఈ సినిమాలో తారక్ పెర్ఫార్మన్స్ హైలైట్ గా నిలుస్తుంది’’ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో అదుర్స్ రఘు, ప్రసన్న కుమార్, యోగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.

అదుర్స్ రఘు, నాజర్, సుమన్, లైసా, భీరం మస్తాన్ రావ్ ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యోగేశ్వర శర్మ, కో ప్రొడ్యూసర్: లింగ శ్రీనివాసరావు, కోరియోగ్రఫీ: శ్రీధర్ రెడ్డి యర్వ, ప్రొడ్యూసర్: ముప్పా అంకమ్మ చౌదరి, కథ-దర్శకత్వం-సినిమాటోగ్రఫీ: వెంకటరమణ సాల్వ.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved