pizza
Terror release on 4 March
You are at idlebrain.com > News > Functions
Follow Us

10 February 2016
Hyderabad

మార్చి 4న విడుదలవుతున్న ‘టెర్రర్’

భారత క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీకాంత్, నికిత హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం టెర్రర్. షేక్ కరీమ్ సమర్పణలో సతీష్ కాశెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 4న విడుదలవుతుంది. ఈ సందర్భంగా...

దర్శకుడు సతీష్ కాశెట్టి మాట్లాడుతూ ‘’ దేశంలో ఎక్కడ విన్నా మనకు టెర్రర్ వార్త వినపడుతుంది. ఈ టెర్రర్ వల్ల చాలా మంది చాలా రకాలైన ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. నిజానికి టెర్రరిస్టుల చర్యలు ముందే తెలిసినా పొలిటీషియన్ ఎలాంటి తీసుకున్న నిర్ణయం ఏంటి? అలాగే దాన్ని నివారించడానికి కరెప్టెడ్ పోలీస్ ఆఫీసర్ చివరకు ఎలా ఎదురు నిలబడ్డాడో అని చెప్పేదే మా సినిమా. సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మార్చి 4న విడుదలవుతుంది’’ అన్నారు.

నిర్మాత షేక్ మస్తాన్ మాట్లాడుతూ ‘’ సినిమా ఎప్పుడో పూర్తయింది. నిర్మాతగా నేను నిర్మించిన తొలి చిత్రమిది. సినిమా సక్సెస్ లో అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ ‘’ నిర్మాతగారు పొలిటిక్స్ లో బిజీగా ఉండటం వల్ల సినిమా విడుదల్లో జాప్యం జరిగినా కచ్చితమైన టైంలో విడుదలవుతుంది. క్లీన్ ఫిలిం. దర్శక నిర్మాతలు సినిమా చేయడానికి ఏ నమ్మకంతో ముందు నాదగ్గరకు వచ్చారో సినిమా తర్వాత కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సతీష్ కాశెట్టి సినిమాను కమర్షియల్ గానే కాదు, అవార్డులు వచ్చేలా కూడా తెరకెక్కించారు. సినిమా మార్చి 4న విడుదలవుతుంది. సినిమా పెద్ద సక్సెస్ సాధించి అందరికీ మంచి పేరు తెస్తుంది’’ అన్నారు.

పృథ్వీ మాట్లాడుతూ ‘’ ఈ సినిమాలో చాలా రోజులు తర్వాత వేరియేషన్ ఉన్న రోల్ చేశాను. చాలా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది’’ అన్నారు.

శ్రీకాంత్, నికితా, కోటశ్రీనివాసరావు, నాజర్, సుధ, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీ భూపాల్, సంగీతం: సాయికార్తీక్, కెమెరా: శ్యామ్ ప్రసాద్, ఎడిటింగ్: బస్వా పైడిరెడ్డి, స్టంట్స్: జాషువా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి అయినీడి, నిర్మాత: షేక్ మస్తాన్, దర్శకత్వం: సతీష్ కాశెట్టి.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved