తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం శనివారం హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు కృతజ్క్షతలు తెలియజేయగానికి ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ఎఫ్డీసీ ఎండీ హరీశ్ ఐఏఎస్లు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఎఫ్డీసీ ఎండీ హరీశ్ గారు మాట్లాడుతూ ''గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో.. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారి గైడెన్స్తో, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు గారి ఓవరాల్ సూపర్విజన్లో సక్సెస్ఫుల్గా తెలంగాణ గద్దర్ అవార్డ్స్ వేడుకను నిర్వహించుకున్నాం. అవార్డ్ వేడుకకు సక్సెస్కు కారణమైన ప్రతి ఒక్కరికి, సినీ అభిమానులకు, సినీ పరిశ్రమకు నా కృతజ్క్షతలు అని తెలిపారు
దిల్ రాజు మాట్లాడుతూ '' తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుకను బిగ్ ఈవెంట్గా నిర్వహించి సక్సెస్ చేశాం. ఆర్నెల కృషితో నిన్న ఈవెంట్ను సక్సెస్ఫుల్గా నిర్వహించాం. తెలంగాణ గద్దర్ అవార్డ్స్ కమిటిని వేసుకుని అన్ని రూల్స్, రెగ్యులేషన్ పాటించి ఈ అవార్డులను అందజేశాం. తెలంగాణ ఆవిర్భావం నుంచి అవార్డులను ఇవ్వాలని అనుకుని 2014 నుంచి 2023 వరకు ఎంపికైన ఉత్తమ చిత్రాలకు, 2024లో ఉత్తమ నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులకు అవార్డులు అందజేశాం. పారదర్శకంగా సినిమాలను, టెక్నిషియన్స్ను అవార్డును ఎంపిక చేశాం. ఈ అవార్డుల వేడుకను బాధ్యతగా తీసుకున్నాం. నిన్న అవార్డు ఫంక్షన్ చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరిగినందుకు ఆనందంగా ఉంది. అవార్డు ఫంక్షన్ జరిగిన విధానం పై మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. అందరూ ప్రశంసిస్తున్నారు.
సినిమా పరిశ్రమలోని అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్లందరికి ఎఫ్డీసీ తరపున నా ధన్యవాదాలు. ఈ సందర్బంగా కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారికి, ఉప ముఖ్యమంతి భట్టి విక్రమార్క గారికి నా థ్యాంక్స్. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సీఏం గారు ఈ వేడుక కోసం రెండున్నర గంటల పదిహేను నిమిషాలు కేటాయించారు. మొదట్లో గంట అనుకున్నారు. అయితే నా రిక్వెస్ట్ ప్రకారం రెండున్నర గంటలకు పైగా ఉండి, అందరికి అవార్డులు అందజేశారు. సీఏం గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అందరికి ఎంతో సంతోషాన్నిచ్చింది. ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్నాయంటే సినిమా పరిశ్రమలోని అందరూ బాధ్యతగా స్వీకరించాలి. షూటింగ్లతో బిజీగా ఉన్నా, ఎక్కడా ఉన్నా ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చిందంటే ఏ రాష్ట్రమైనా ఆ వేడుకకు వచ్చి అవార్డ్ తీసుకోవాలి. భవిష్యత్లో ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి అవార్డ్ వస్తే స్వీకరించాలి. ఇది నా రిక్వెస్ట్. ఇక ఇంత పెద్ద వేడుకలో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏమైనా తప్పులు జరిగి ఉంటే, వాళ్లు బాధపడి ఉంటే వాళ్లకు ఎఫ్డీసీ తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను. ఈవెంట్ అయిన తరువాత అందరూ అప్రిషియేట్ చేశారు, ప్రభుత్వం నుంచి రిపోర్ట్స్, బయటి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ చాలా పాజిటివ్గా ఉంది' అన్నారు.