Itlu Mee Yedhava on 21 Nov
యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఇట్లు మీ ఎదవ' మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ (నిజాం), ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్(ఆంధ్ర, సీడెడ్) ద్వారా నవంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్
త్రినాధ్ కఠారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇట్లు మీ ఎదవ. సాహితీ అవాంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచాయి.
నవంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. నైజాంలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP విడుదల చేయనుండగా, ఆంధ్ర, సీడెడ్ లో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ రిలీజ్ చేయనుంది. ఈ రెండు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. R P పట్నాయక్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి జగదీష్ చీకటి డీవోపీ, ఎడిటర్ ఉద్ధవ్ SB.