17 August 2018
Hyderabad
డాన్స్ అకాడమీ సమర్పణలో శ్రీ మీనాక్షి మూవీస్ బ్యానర్పై కిషన్ కె.కె, కశ్మీరా తారాగణంగా కొత్త చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. కె.సత్యారెడ్డి నిర్మాత. దాసరి లారెన్స్ దర్శకుడు. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమంలో..
ఈ చిత్ర తొలి సన్నివేశానికి తెలంగాణ భారీ నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీశ్ రావు క్లాప్ కొట్టగా.. తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేశారు. సి.కల్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు.
డైరెక్టర్ మాట్లాడుతూ - ``క్రైమ్ థ్రిల్లర్. ఇందులో హీరో పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. సెప్టెంబర్ 5 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది`` అన్నారు.
హీరో మాట్లాడుతూ - ``మంచి కాన్సెప్ట్. డైరెక్టర్ దాసరి లారెన్స్ గారు చెప్పగానే బాగా నచ్చింది. అందరికీ నచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాం`` అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ - ``డైరెక్టర్ లారెన్స్గారు కొత్త కాన్సెప్ట్తో చేస్తున్న సినిమా ఇది. తప్పకుండా సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది`` అన్నారు.
హీరోయిన్ కశ్మీరా మాట్లాడుతూ - ``ఇందులో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాను. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్.ఎన్.బాబు, డైలాగ్స్: అనురాగ్ విశ్వక్, మధుసూదన్, ఆర్ట్: డేవిడ్, కొరియోగ్రఫీ: భరత్, ఫైట్స్: మంజు.