ఎస్.వి.కె.సినిమా బేనర్పై భరత్, సృష్టి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం `ఓయ్..నిన్నే`. వంశీకృష్ణశ్రీనివాస్ నిర్మాత. సత్య చల్లకోటి దర్శకుడు. ఈ సినిమా సక్సెస్ మీట్ ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో...
నిర్మాత వంశీకృష్ణ మాట్లాడుతూ - ''మా ఎస్వికె బేనర్పై సినిమా విడుదలై సక్సెస్ఫుల్గా ప్రదర్శింపబడుతుంది. గతంలో సోలో, రారాకృష్ణయ్య సినిమాల తరహాలో ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు ఈ సందర్భంగా థాంక్స్. కథ బావుంటే ఎలాంటి సినిమానైనా ఆదరిస్తారని ఓయ్..నిన్నే సినిమా ఉదాహరణంగా నిలిచింది. భవిష్యత్లో మరిన్ని మంచి సినిమాలు చేసే అవకాశం కలుగుతుందని భావిస్తున్నాను'' అన్నారు.
నాగినీడు మాట్లాడుతూ - ''ఓయ్..నిన్నే అనే టైటిల్ వినగానే సినిమాపై ఆసక్తి కలిగింది. సినిమా ముందు నుండి సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. బయట నుండి సినిమాపై మంచి రెస్పాన్స్ వస్తుంది. మంచి సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరుతున్నాను'' అన్నారు.
దర్శకుడు సత్య చల్లకోటి మాట్లాడుతూ - ''సినిమా పాజిటివ్ టాక్తో రన్ అవుతోంది. కంటెంట్ బావుందని, బాగా డైరెక్ట్ చేశానని అభినందిస్తున్నారు. నిర్మాత వంశీకృష్ణగారు ఇచ్చిన సహకారంతో మంచి సినిమా చేయగలిగాను, భరత్, సృష్టి, నాగినీడుగారు అద్భుతంగా చేశారు. ముఖ్యంగా తండ్రిపాత్రలో బెస్ట్ పెర్ఫామెన్స్ చేశారు. సత్య, ప్రగతి, రఘుబాబు, ప్రగతి, తులసి అందరూ చక్కగా సహకారం అందించారు. ఈ సినిమాకు ఇంకా మంచి ప్రోత్సాహం అందిస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు.
హీరో భరత్ మాట్లాడుతూ - ''మా సినిమా ఓయ్..నిన్నే విడుదలైంది. మా యూనిట్కు పండుగలా అనిపిస్తుంది. మా యూనిట్ బాగా చేశామని అభినందిస్తున్నారు. బావా మరదలు, తండ్రికొడుకులు మధ్య సంఘర్షణలతో సినిమాను దర్శకుడు చక్కగా తెరకెక్కించారు. శేఖర్ చంద్రగారి సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాకు ప్రాణం పోశారు. సినిమా సక్సెస్లో బాగమైన అందరికీ థాంక్స్'' అన్నారు.
హీరోయిన్ సృష్టి మాట్లాడుతూ - ''మా సినిమాను ఆదరిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు థాంక్స్. దర్శకుడు నేచురల్గా సినిమాను తెరకెక్కిస్తే, నిర్మాతగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశారు. ఇక భరత్ చాలా బాగా సపోర్ట్ చేశాడు. అలాగే నాగినీడుగారు మా మావయ్య క్యారెక్టర్లో చక్కగా చేశారు. మంచి సినిమాలో, మంచి పాత్ర చేసినందుకు ఆనందంగా ఉంది'' అన్నారు.