pizza
Sri Valli success meet
మా చిత్రాన్ని ఆద‌రించినందుకు ధ‌న్య‌వాదాలు - `శ్రీవ‌ల్లి` నిర్మాత‌లు
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 September 2017
Hyderaba
d

రాజ్ కుమార్ బృందావనం, సునీత రాజ్‌కుమార్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం `శ్రీవ‌ల్లీ`. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించారు. బాహుబలి ఫేం ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. రజత్, నేహా జంటగా నటించారు. ఏరోటిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లైంది.

నిర్మాత‌లు మాట్లాడుతూ `` మా సినిమాను ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వ‌దాలు. ఈ సినిమా మాలో న‌మ్మ‌కాన్ని పెంచింది. మా త‌దుప‌రి చిత్రం సుకుమార్‌గారితో క‌లిసి చేస్తున్నాం. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం`` అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``ఈ సినిమా నిర్మాత‌లు అన్ని విధాలుగానూ స‌క్సెస్ అయ్యారు. ఈ చిత్రాన్ని ఇంకాస్త బాగా తీయాల్సింది. నేనే తీయ‌లేక‌పోయాను. అందుకు నిర్మాత‌ల‌కు సారీ చెబుతున్నాను. న‌టీన‌టులు చ‌క్క‌గా న‌టించారు`` అని తెలిపారు.

హీరో మాట్లాడుతూ ``ఈ సినిమాను నా కోస‌మే తీసిన‌ట్టుంది. గౌతం పాత్ర‌ను ప్రేక్ష‌కులు బాగా అభినందిస్తున్నారు`` అని చెప్పారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved