|
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
27 July 2020
USA
హ్యూస్టన్: జూలై 26: అమెరికాలో కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ను గౌరవించి వారిని ప్రోత్సాహించేందుకు నాట్స్ తన వంతు కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ హ్యూస్టన్ విభాగం ఫోర్ట్ బెండ్ కౌంటీ, న్యాయమూర్తి కే.పి.జార్జ్, టెక్సాస్ జడ్జ్ కార్యాలయం, అత్యవసర సిబ్బందికి భోజన ప్యాకెట్లు అందించింది. దాదాపు 100 మందికి పైగా భోజనాలు సిద్ధం చేసి ఆ ప్యాకెట్లను వారి కార్యాలయంలో అందించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సునీల్ పాలేరు, సౌత్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ కొల్ల, నాట్స్ హ్యూస్టన్ టీం చాప్టర్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ కాకుమాను, వీరూ కంకటాల, విజయ్ దొంతరాజు తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. కరోనాపై ముందుండి పోరాడే వారిని ప్రోత్సహించేందుకు నాట్స్ ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడాన్ని ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్జ్ కేపీ జార్జీ ప్రశంసించారు.
|
|
|
|
|
|