pizza
NATS Team assistance for the COVID-19 victims in Guntur,
కరోనా ప్రభావ బాధితులకు న్యూజెర్సీ నాట్స్ టీం సాయం
గుంటూరు నగరంలో ఉచితంగా బియ్యం పంపిణీ
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

27 July 2020
USA


గుంటూరు: జులై 26: కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయి.. తెలుగునాట జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారిన పేదలకు అండగా నిలబడేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన వంతు ప్రయత్నం చేస్తోంది. తాజాగా గుంటూరు నగరంలోని 100 పేద కుటుంబాలను గుర్తించి బియ్యాన్ని పంపిణీ చేసింది. ఒక కుటుంబానికి నెలకు సరిపడే విధంగా బియ్యాన్ని న్యూజెర్సీ టీం అందించింది. రెండు టన్నుల బియ్యాన్ని నగరంలోని రెండు వార్డుల్లో పంపిణీ చేసింది. న్యూజెర్సీ నాట్స్ టీం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నాట్స్ తరపున గుంటూరులోని నాట్స్ ప్రతినిధులు వెంకట్ వెంపరాల, సురేంద్ర చెన్నుపాటి, బలరాం పాటిబండ్ల బియ్యాన్ని పంపిణీ చేశారు. భవిష్యత్తులో 16 గ్రామాల్లో కూడా పేదలకు బియ్యం అందించేందుకు న్యూజెర్సీ నాట్స్ టీం ఏర్పాట్లు చేస్తోంది.

నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని మరియు నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి మాట్లాడుతూ నాట్స్ సంస్థ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అమెరికా లోనే కాక తెలుగు రాష్ట్రాలలో కూడా తెలుగు వారికి తన వంతు సాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved