pizza
Mega Chiranjeevitam book launch by Ram Charan
సీనియర్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు రచించిన `మెగా చిరంజీవితం` 150 సినీ ప్రస్థానం బుక్‌ రిలీజ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

21 January 2017
Hyderaba
d

మెగాస్టార్‌ చిరంజీవి 150 చిత్రాలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ సీనియర్‌జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు రచించిన పుస్తకం `మెగా చిరంజీవితం 150` సినీ ప్రస్థానం శనివారం విడుదలైంది. రామ్‌చరణ్‌ పుస్తకాన్ని విడుదల చేసి దర్శకుడు వి.వి.వినాయక్‌కు అందించారు. ఈ సందర్భంగా....

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ - ''తెలుగు సినిమా ఇండస్ట్రీలో నలబై ఐదేళ్ళుగా జర్నలిస్ట్‌గా ఉంటున్న పసుపులేటి రామారావు చిరంజీవిగారిపై బుక్‌ రాయడం సంతోషంగా ఉంది. ఈ పుస్తకాన్ని ఖైదీ నంబర్‌ 150 ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లోనే విడుదల చేయాల్సింది కానీ కుదరలేదు. చిరంజీవిగారి నట ప్రస్థానానికి సంబంధించి అన్ని కోణాలను రామారావుగారు ఈ పుస్తకంలో పొందు పరిచి ఉంటారని భావిస్తున్నాను. మా ఫ్యామిలీ తరపున పసుపులేటి రామారావుగారికి థాంక్స్‌'' అన్నారు.

వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ - ''చిరంజీవిగారంటే పసుపులేటి రామారావుగారికి ఎంత అభిమానమో, పసుపులేటి రామారావుగారన్నా చిరంజీవిగారికి అంతే అభిమానం. సీనియర్‌ జర్నలిస్ట్‌ రామారావుగారు రాసిన ఈ పుస్తకం అద్భుతంగా ఉంది. ఈ పుస్తకంలోని కొన్ని ఫోటోలను చూస్తుంటే పాత రోజులు గుర్తుకు రావడమే కాదు, ఆ సినిమాల రిలీజ్‌ సమయంలో చేసిన అల్లరి గుర్తుకు వస్తుంది. ఈ పుస్తకంలో మెగా అంటే చిరంజీవి..చిరంజీవి అంటే స్వయం కృషి అని రామారావుగారు రాయడం ఎంతో సూపర్‌గా అనిపించింది. చిరంజీవిగారిని రామారావుగారు దగ్గర నుండి చూడటం వల్లనే ఆయన ఈ వాక్యాన్ని రాయగలిగారు. మా అందరి తరపున రామారావుగారికి థాంక్స్‌'' అన్నారు.

సి.కల్యాణ్‌ మాట్లాడుతూ - ''నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, అన్నయ్య కోతలరాయుడు సినిమాకు పనిచేస్తున్నప్పుడు ఆ సినిమాకు రామారావుగారు పి.ఆర్‌.ఒగా పనిచేశారు. అందరి జర్నలిస్టుల కంటే సీనియర్‌గా తనదైన శైళిలో రాణించారు. గౌరవానికే గౌరవమైన చిరంజీవిగారిపై రామారావుగారు పుస్తకం రాయడం ఆనందంగా ఉంది. అందరూ ఇప్పుడు చిరంజీవిగారిని చూసి బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటున్నారు కానీ, చిరంజీవిగారు ఎప్పటికీ బాస్‌. చిరంజీవిగారిపై వచ్చిన ఈ పుస్తకాన్ని పత్రి అభిమాని చదవాలి'' అన్నారు.

పసుపులేటి రామారావు మాట్లాడుతూ - మెగా చిరంజీవితం150 అనే టైటిల్‌ను ఈ పుస్తకానికి పెట్టడానికి ముందు చాలా ఆలోచించాం. చిరంజీవిగారి పుస్తకానికి ఏ పేరు పెట్టాలా అని సీనియర్‌ జర్నలిస్ట్‌ వినాయకరావుగారు, చిన్నారాయణగారితో చర్చించాను..అయితే చివరకు నేను చిరంజీవిగారిపై ముందు రాసిన మెగా చిరంజీవితం అనే టైటిల్‌ను పెడితే బావుంటుందనిపించి అరవింద్‌గారికి తెలియజేశాను. ఆయన కూడా నైతికంగా ఎంతో మద్ధతునిచ్చారు. నేను అడగ్గా నా కోసం ఈ పుస్తకం కోసం స్పెషల్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే చిరంజీవిగారు కూడా ఓ స్పెషల్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే దాసరిగారిని అడగ్గానే ఓ స్పెషల్‌ ఆర్టికల్‌ రాసిచ్చారు. నేను విశాలాంధ్రలో పనిచేస్తున్నప్పటి నుండి చిరంజీవిగారితో అనుబంధం ఉంది. మీడియా అంటే చిరంజీవిగారు ముందు నుండి అభిమానం చూపేవారు. అలాగే సినిమాల్లో ఆయన పడ్డ కష్టాన్ని నేను దగ్గర నుండి చూశాను. ఈ రోజు చరణ్‌బాబు చేతుల మీదుగా పుస్తకం రిలీజ్‌ కావడం ఎంతో ఆనందంగా ఉంది'' అన్నారు.

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ - ''పసుపులేటి రామారావుగారు నలబై ఏళ్ళకు పైగా జర్నలిస్ట్‌గా వర్క్‌ చేశారు. ఆయన అనుభవమంతా వయసు లేనివాడిని, ఆయన గురించి నేను ఏం మాట్లాడాలో తెలియలేదు. నేను చిన్నప్పటి నుండి తెలుగులో నెంబర్‌ వన్‌ జర్నలిస్ట్‌గా పసుపులేటి రామారావుగారి పేరు వింటున్నాను. ఈ పుస్తకంలో నేను కూడా చూడని నా ఫోటోస్‌ను రామారావుగారు సేకరించారు. ఈ పుస్తకం మా లైబ్రరీలో నెంబర్‌ వన్‌ బుక్‌ అవుతుంది. నాన్నగారు, మా కుటుంబం, అభిమానుల తరపున పసుపులేటి రామారావుగారికి థాంక్స్‌'' అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved