pizza
Emi Sodara Manasuki Emayindira Movie Launch
'ఏమి సోదరా..మనసుకేమైందిరా' ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 September 2016
Hyderaba
d

జె.వి.ఆర్‌.సినిమాస్‌, వైష్ణవి ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్స్‌పై శరత్‌ కల్యాణ్‌, హనిగుప్త, మోహన్‌ వత్స, ఉపాసన హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్‌ నేదునూని దర్శకత్వంలో జె.వి.ఆర్‌, దేశ్‌ముఖి రాజు యాదవ్‌, శ్రీనివాస్‌ నేదునూరి నిర్మాతలుగా నూతన చిత్రం 'ఏమి సోదరా..మనసుకేమైందిరా' గురువారం ఉదయం హైదరాబాద్‌ ఫిలించాంబర్‌లోని దైవ సన్నిధానంలో లాంచనంగా ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి జగదీష్‌శ్వర్‌రెడ్డి క్లాప్‌ కొట్టగా, కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో...

జె.వి.ఆర్‌ మాట్లాడుతూ ''నిర్మాతగానే కాకుండా ఈ సినిమాలో కీలకమైన పాత్ర యమధర్మరాజుగా నటిస్తున్నాను. కొత్త నటీనటులు ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు'' అన్నారు.

రాణి ఛటర్జీ మాట్లాడుతూ ''రెండు వందలకు పైగా బోజ్‌పురి సినిమాల్లో నటించాను. తెలుగులో నటిస్తున్న తొలి సినిమా ఇదే. ఇందులో ఓ స్పెషల్‌సాంగ్‌ చేస్తున్నాను'' అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్‌ నేదునూరి మాట్లాడుతూ - ''వైజాగ్‌ సత్యానంద్‌గారి వద్ద ట్రయినింగ్‌ తీసుకున్న శరత్‌ కల్యాణ్‌ ఈ సినిమాలో వన్‌ ఆఫ్‌ ది హీరోగా నటిస్తున్నాడు. యాక్టర్స్‌ అందరూ కొత్తవాళ్ళే. ఈ చిత్రంలో యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ప్రేమ గురించి చూపించబోతున్నాం. కానీ ప్రేమికుల గురించి చూపించడం లేదు'' అన్నారు.

నిర్మాత దేశ్‌ముఖి రాజు యాదవ్‌ మాట్లాడుతూ - ''మంచి టైటిల్‌తో సినిమా స్టార్ట్‌ చేశాం. దర్శకుడు శ్రీనివాస్‌గారు చెప్పిన కథ నచ్చింది. సినిమా ఆడియెన్స్‌కు నచ్చే విధంగా తెరకెక్కిస్తాం'' అన్నారు.

ఈ కార్యక్రమంలో కృష్ణుడు, తాగుబోతురమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రంలో జె.వి.ఆర్‌., తాగుబోతు రమేష్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్‌: వాల్మీకి, సంగీతం: మెలోడి శ్రీనివాస్‌, కెమెరా: మురళీకృష్ణ, సహ నిర్మాత: పైల నర్సింహరావ్‌, నిర్మాతలు: జె.వి.ఆర్‌, దేశ్‌ముఖి రాజు యాదవ్‌, శ్రీనివాస్‌ నేదునూరి, రచన, దర్శకత్వం: శ్రీనివాస్‌ నేదునూరి.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved