pizza
Meelo Okkadi Katha movie launch
'మీలో ఒక్కడి కథ' ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

2 November 2016
Hyderaba
d

ప్రజాపతి చిత్రశాల బ్యానర్‌పై ప్రజాపతి శంకర్‌ దర్శక నిర్మాణంలో కొత్త చిత్రం 'మీలో ఒక్కడి కథ'. బుధవారం ఉదయం హైదరాబాద్‌ తెలుగు ఫిలించాంబర్‌లో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి సి.కల్యాణ్‌ క్లాప్‌ కొట్టారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ప్రజాపతి శంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. వీర శంకర్‌ దర్శకుడికి స్క్రిప్టును అందజేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో....

Glam gallery from the event

దర్శక నిర్మాత ప్రజాపతి శంకర్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమాలో అందరూ కొత్తవారే నటిస్తున్నారు. నా దర్శక నిర్మాణంలోనే సినిమా ఉంటుంది. సామాజిక కథాంశంతో సినిమా ఉంటుంది. ఈ నవంబర్‌ నెలలోనే సినిమా చిత్రీకరణ ప్రారంభమై ఒక షెడ్యూల్‌లోనే సినిమాను పూర్తి చేస్తాం'' అన్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ - ''చిన్న సినిమాలతోనే ఇండస్ట్రీ మనుగడ సాగిస్తుంది. చిన్న సినిమాలో పరిచయమయ్యే నటీనటులు, టెక్నిషియన్స్‌ పెద్ద స్టార్స్‌గా ఎదుగుతారు. ఈ సినిమాతో కూడా చాలా మంది కొత్తవారు పరిచయం అవుతున్నారు. వీరికి మంచి భవిష్యత్‌ ఉండాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

ఈ కార్యక్రమంలో జెబి.మోహన్‌గౌడ్‌ పాల్గొని చిత్రయూనిట్‌ను అభినందించారు.

ప్రజాపతి శంకర్‌, స్రవంతి, జై, జ్యోతి, పూర్ణేష్‌, గూడెపు, అశోక్‌చంద్ర, సంపత్‌రాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం:ప్రజాపతి శంకర్‌.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved