pizza

Vunnadi Okate Zindagi thank you meet
`ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ` థాంక్స్ మీట్

You are at idlebrain.com > News > Functions
Follow Us

29 October 2017
Hyderabad

రామ్‌, అనుపమ పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. స్రవంతి రవికిషోర్‌, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 27న సినిమా విడుదలైంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన థాంక్స్ మీట్‌లో చిత్ర యూనిట్ పాల్గొంది. ఈ సంద‌ర్భంగా....

శ్రీవిష్ణు మాట్లాడుతూ - ``చాలా మంచి సినిమా, ప్రేక్ష‌కులు సినిమాను బాగా ఆద‌రిస్తున్నందుకు వారికి నా ధ‌న్య‌వాదాలు. కొత్త అటెంప్ట్ చేశాం. సినిమా స‌క్సెస్‌తో మ‌రి కొన్ని కొత్త కాన్సెప్ట్ సినిమాలు రావ‌డానికి ఈ సినిమా దారి చూపిన‌ట్ల‌య్యింది. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో అయితే నేను, డైరెక్ట‌ర్ ఏడ్చిన సందర్భాలున్నాయి. సినిమాను ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌`` అన్నారు.

ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల మాట్లాడుతూ - ``సినిమా అంద‌రికీ బాగా క‌నెక్ట్ అయ్యింది. చాలా మంది సీన్స్ గురించి మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ల‌వ్ ప్ర‌పోజ‌ల్ సీన్‌కు నాలుగు రోజుల స‌మ‌యం తీసుకుని రాసుకున్నాను. అలాగే ఎమోష‌న‌ల్ డైలాగ్స్‌కు కూడా మంచి స్పంద‌న వ‌స్తుంది. ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తున్నారు. అనుప‌మ‌, లావ‌ణ్య పాత్ర‌లు అంద‌రికీ క‌నెక్ట్ అయ్యాయి. అంద‌రినీ న‌వ్విస్తూ అక్క‌డ‌క్క‌డా కూడా ఏడిపించాను. రామ్ పాత్ర అంద‌రికీ ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అవుతుంది`` అన్నారు.

హీరో రామ్ మాట్లాడుతూ - ``యూత్ బేస్డ్ మూవీ అవుతుంద‌ని మేం ముందుగా అనుకున్నాం. కానీ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా సినిమా బాగా క‌నెక్ట్ అయ్యింది. సినిమాను అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కులకు బాగా ద‌గ్గ‌రైంది. సినిమాలో డైలాగ్స్‌ను అంద‌రూ చెబుతుండ‌టం చాలా బాగా న‌చ్చింది. పాత్ర‌లు అంద‌రికీ గుర్తుండిపోయాయి. నిర్మాత‌లు కూడా హ్యాపీగా ఉన్నారు`` అన్నారు.

ఈ కార్యక్ర‌మంలో శ్రీమ‌ణి, కిరిటీ, కృష్ణ‌చైత‌న్య‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, చంద్ర‌బోస్‌, ప్రియ‌ద‌ర్శి, స్రవంతి ర‌వికిషోర్‌, ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved